ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 1: ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంపై ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబినార్ను మంగళవారం నిర్వహించనున్నారు. ‘బ్రిడ్జింగ్ పాస్ట్ అండ్ ప్రజెంట్: రామప్ప టెంపుల్-యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ’పై నిర్వహించనున్న ఈ వెబినార్లో ప్రముఖ ఆర్కియాలజిస్ట్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ప్రొఫెసర్ శివనాగిరెడ్డి, ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలు పి.అనూరాధారెడ్డి ఉపన్యసించనున్నట్లు వెబినార్ కన్వీనర్ డాక్టర్ లావణ్య తెలిపారు. మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.