కవాడిగూడ, సెప్టెంబర్ 11: స్వామి వివేకానందుడి బోధనలు అనుసరణీయమని, నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడిచి.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. చికాగోలో స్వామి వివేకానందుడు ప్రసంగించి 128 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ట్యాంక్బండ్పై ఉన్న స్వామి వివేకానందుడి విగ్రహానికి హ్యూమన్ ఎక్స్లెన్సీ డైరెక్టర్ స్వామి బోదమయానంద, ఎమ్మెల్యే గొంగిడి సునీత పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చికాగో విశ్వవేదికపై సర్వమత ప్రతినిధుల సభలో స్వామి వివేకానందుడు ప్రసంగించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని స్వామి బోదమయానంద అన్నారు. గొంగిడి సునీత మాట్లాడుతూ రామకృష్ణ మఠం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం లోయర్ ట్యాంక్బండ్లోని రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్సీ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుడి విగ్రహానికి హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. రామకృష్ణ మఠం కేంద్రంగా స్వామి బోదమయానంద వెబినార్ను నిర్వహించారు. వర్చువల్లో స్వామి వివేకానంద యూత్ అచ్యూవ్మెంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం మాట్లాడారు.