హైదరాబాద్: కరోనా మహమ్మారి విస్తరణ, లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇండ్లకే పరిమితమైన హైదరాబాదీలు.. ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లు, పబ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. టాలీవుడ్ స్టార్ రామ్చరణ్ దంపతులూ అందుకు అతీతమేమీ కాదు. బుధవారం వాళ్లు కూడా సరదాగా రెస్టారెంట్కు వెళ్లి లంచ్ చేస్తూ కొంత సమయం గడిపారు. రామ్చరణ్ సతీమణి ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ఖతా ద్వారా ప్రేక్షకులతో ఈ విషయాన్ని పంచుకున్నారు.
దంపతులిద్దరూ చిరునవ్వుతో కెమెరావైపు చూస్తున్న ఓ ఫొటోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఉపాసన పూల డిజైన్తో కూడిన రెడ్ టాప్, గ్రీన్ ప్యాంట్స్ ధరించి ఉన్నారు. ఇక రామ్చరణ్ క్లాసీగా తెల్లచొక్కాలో ఉన్నారు. ఈ ఫొటోతోపాటు ఉపాసన ఆంగ్లంలో మిడ్ వీక్. లంచ్ బ్రేక్, లంచ్ డేట్. ఇలా లంచ్ చేసి ఎంతో కాలమైంది అనే క్యాప్షన్ను కూడా జతచేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రామ్చరణ్ దంపతులను పొగడ్తల్లో ముంచెత్తుతూ కామెంట్ల వర్షం కురుస్తున్నది. అంతేకాదు తన భార్య చేసిన పోస్ట్పై స్వయంగా రామ్చరణ్ కూడా హార్ట్ ఎమ్మోజీతో స్పందించారు. ఇక రామ్చరణ్ సినిమాల విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి చేసిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ దాదాపు విడుదలకు సిద్ధమైంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవేగాక డైరెక్టర్ శంకర్తో కూడా రామ్చరణ్ ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.
ఇవి కూడా చదవండి..
హిమాలయన్ జూలో చిరుత కూనల సందడి.. వీడియో
తప్పిపోయిన కుక్క ఏడేండ్లకు దొరికింది..!
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!