సైదాబాద్, సెప్టెంబర్ 17: కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో మిధాని రక్షణ రంగ సంస్ధ అధికారి డాక్టర్ బి.బాలాజీకి రాజభాష గౌరవ పుర స్కార్ను ప్రదానం చేసి ఆయనకు సన్మానం చేశారు. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషా శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వ హించింది. 2020-21వ సంవత్సరానికి నాన్ హిందీ స్పీకింగ్ ప్రాం తం కేటగిరి కింద రాజభాష గౌరవ్ పురస్కారంతో ఆయనకు సన్మానం చేశారు. డాక్టర్ బి.బాలాజీ హిందీలో రాసిన ‘ఆర్మ రింగ్ కే ఉత్పాదన్ మే ఆగ్రణి మిధాని’ కోసం ఈ అవార్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, నిషిత్ ప్రామాణిక్ నుంచి స్వీకరించా రు. కార్యక్రమంలో మిధాని జీఎం ఏ.రామకృష్ణారావు పేర్కొన్నారు.