హైదరాబాద్ : సుల్తాన్బజార్లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో పూర్వ కొత్వాల్, భాషా నిలయం పూర్వ అధ్యక్షుడు రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి జయంతిని పుస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, భాషా నిలయం అధ్యక్షుడు నూతి శంకరరావు, గౌరవ కార్యదర్శి టి. ఉడయవర్లు, సభ్యులు జి.నరసింహామూర్తి, యం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.