హిమాయత్నగర్, మార్చి 26: రాజ్ మోహల్ల పద్మశాలి సంఘాలకే గుర్తింపు ఉంటుందని, కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్మించిన సంఘం నుంచే పద్మశాలీల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణగూడలోని రాజ్ మోహల్ల పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆవిర్భావ సభ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతిని కాంక్షించే ప్రతి ఒకరూ పద్మశాలి భవన్ కేంద్రంగా పనిచేసే సంఘాలలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ ఆదర్శమని వారు వేసిన పునాధులపైనే సంఘ నిర్మాణం జరగాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన పద్మశాలీలను చూస్తుంటే ఆనందంగా ఉందని, భవిష్యత్తు విజయానికి ఈ ఐక్యత తొలి మెట్టుగా భావిస్తున్నానని పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ పద్మశాలి సంఘం కన్వీనర్ మచ్చ ప్రభాకర్ రావు, మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు , అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ , గద్వాల్, యాదాద్రి, అసిఫాబాద్, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు.