హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్హౌస్, గోల్కొండ, చార్మినార్, చాంద్రాయన గుట్ట, యాకుత్పుర, కార్వాన్, బహదూర్పుర, దూద్బౌలి, గౌలిపుర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది.
కాగా, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లండి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.