మేడ్చల్/సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసి ముైద్దెంది. టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 8గంటల వరకు అత్యధికంగా మేడ్చల్ జల్లాలోని మూడుచింతలపల్లి 31.3 కాగా నగరంలోని సైదాబాద్లో 2.4సెం.మీలు, శేరిలింగంపల్లి మాదాపూర్ 2.4సెం.మీలు, ఆర్సీపురంలో 2.1, ఆసిఫ్నగర్, గచ్చిబౌలిలో 2.0,
చందానగర్లో 1.9, మాదాపూర్లో, బోరబండ, లింగంపల్లి, వివేకానంద కమ్యూనిటీ హాల్ (కూకట్పల్లి), ఎల్బీనగర్ 1.8, బండ్లగూడ, ఎంసీహెచ్ఆర్డీ ఐటీ క్యాంపస్ (షేక్పేట), కాప్రా 1.7, బన్సీలాల్పేట్, సర్ధార్మహల్ (చార్మినార్), బీహెచ్ఈఎల్, మియాపూర్, వెంకటేశ్వకాలనీ, బాలజీనగర్, హయాత్నగర్, శ్రీనగర్కాలనీ 1.6, కేపీహెచ్బీ, ఖాజాగూడ, మచ్చబొల్లారం, మూసాపేట్, బంజారాహిల్స్, రాయదుర్గ, సెంట్రల్ యూనివర్సిటీ (శేరిలింగంపల్లి), బాలానగర్, సౌత్హస్తినాపురం 1.5, టోలిచౌకి, మెహిదీపట్నం, షేక్పేట,
బీఆర్అంబేద్కర్ భవన్, కార్వాన్, విజయ్నగర్కాలనీ, కాంచన్బాగ్, హైదర్నగర్ 1.4, రేన్ బజార్, కుత్బుల్లాపూర్, షాపూర్నగర్, సెస్ (సనత్నగర్), ఆల్లబడ్డ, ముషీరాబాద్, లింగోజిగూడ, నాగోల్, గుడిమల్కాపూర్ 1.3, గణాంక భవన్, మైత్రీవనం, మౌలాలీ, ఐఎస్సదన్, ఘన్సీబజార్, మారూతీనగర్, యూసుఫ్గూడ, ఇందిరానగర్, అత్తాపూర్, ఆస్మాన్ఘడ్, వెస్ట్ మారేడ్పల్లి, ఫాతిమానగర్, దూద్భౌళి, బేగంపేట, కూకట్పల్లి 1.2, జహనుమా, అల్కాపురి, లంగర్హౌజ్, మల్కాజిగిరి, రామంతాపూర్, రంగారెడ్డినగర్, గన్ఫౌండ్రీ,
సీతాఫల్మండి, గాజులరామారం, శివరాంపల్లి, మలక్పేట్ 1.1, నాచారం, తిరుమలగిరి, పాటిగడ్డ, జీడిమెట్ల, రాజీవ్నగర్, హబ్సిగూడ, చిల్కానగర్, జూబ్లీహిల్స్, చర్లపల్లి, జగద్గిరిగుట్ట 1.0 మేడ్చల్ 26.0,దుండిగల్ 25.0,బాచుపల్లి 28.3,శామీర్పేట్ 28.4,కీసర 27.5,ఘట్కేసర్ 28.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్టం 23.6, కనిష్టం 21.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 93 శాతంగా నమోదైంది. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.