వెంకటాపూర్, జూలై 13: ఛత్తీస్గఢ్ నుంచి జహీరాబాద్కు ఆవులు, ఎద్దులను తరలిస్తున్న కంటైనర్లను ములుగు పోలీసులు పట్టుకున్నారు. అందులోని పశువులను గోశాలకు తరలించారు. ఎస్సై ఓంకార్ యాదవ్ కథనం ప్రకారం.. రెండు కంటైనర్లలో 43 ఆవులు, 46 ఎద్దులను తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు ములుగు పోలీసులు మంగళవారం తనిఖీలు చేసి పట్టుకున్నారు. అందులోని ఆవులు, ఎద్దులను మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప శ్రీరామలింగేశ్వరస్వామి గోశాల యజమాని వీరమల్ల శ్రీనివాసరావుకు అప్పగించామని ఎస్సై ఓంకార్యాదవ్ తెలిపారు. అందులో రెండు ఆవులు మృతి చెందగా, పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.