విక్రయానికి సిద్ధంగా ఉన్న 400 కేజీలు
రాచకొండ పోలీసులు దాడి.. అరెస్ట్
రూ.20లక్షల విలువ చేసే పంట స్వాధీనం
కందుకూరు : తెలిసినవారి మాటలు నమ్మి.. భారీగా డబ్బు సంపాదించవచ్చునని అత్యాశకు పోయి నిషేధిత పంటను సాగుచేసిన ఓ రైతును రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నిషేధిత 400 కేజీల గసగసాలు( ఓపీఎం)ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, నల్లమడ మండలం, కటాలపల్లి గ్రామానికి చెందిన దండుపల్లి చెన్నకేశవులు బతుకు దెరువు నిమిత్తం 20 సంవత్సరాల క్రితం భార్య, పిల్లలతో నగరానికి వలస వచ్చి… షాద్నగర్, తుక్కుగూడ, కందుకూరుతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జామ, మామిడి తో టలను లీజుకు తీసుకుకొని సాగుచేస్తున్నాడు. అందులో భాగంగా కందుకూరు మండల పరిధిలోని లేమూరు గ్రామంలో బుచ్చిరెడ్డికి చెందిన 20 ఎకరాల జామ, మామిడి తోటను లీజుకు తీసుకోగా.. అందులో ఎక్కు వగా లాభం రాలేదు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూ రు జిల్లా చౌడిపల్లి మండలం, గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన దిమ్మిర్ వెంకటరమణ పరిచయం అయ్యాడు. మీ పొలంలో గసగసాల పంట వేస్తే పెద్ద మొత్తంలో డ బ్బు సంపాదించవ్చని వెంకటరమణ చెప్పాడు. దానికి కావాల్సిన విత్తనాలను అం దించాడు. ఎక్కువగా డబ్బు వస్తుందని ఆశకు పోయిన చెన్నకేశవులు లీజుకు తీసు కున్న బుచ్చిరెడ్డికి చెందిన రెండు ఎకరాల స్థలంలో ఈ పంటను వేశాడు. ఈ పంట పండిన తర్వాత కేజీ గసగసాలును రూ.5 వేలకు కేజీ చొప్పున కొంటానని చెన్నకేశవులతో వెంకటరమణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీటికి బెంగళూరు లో భారీ ధర పలుకుతుం ది… అక్కడ విక్రయించి బా గా సంపాదించాలనుకున్నా డు. పంట పండి దాదా పు 400 కేజీల గసగసాలును చెన్నకేశవులు సిద్ధంగా ఉంచాడు. వీటిని విక్రయిస్తే రూ.20 లక్షలు వస్తాయని భావించాడు. ఇంతలో రాచకొండ పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం చెన్నకేశవులు పండించిన పంటపై దాడి చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.. అక్కడి నుంచి 400 కేజీల గసగసాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను అందించిన వెంకటరమణను ఈ నెల 16న ఏపీ మ దనపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పీటీ వారెంట్ మీద తీసుకువచ్చి.. విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీ యాదిగిరిరెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణంరాజులు పాల్గొన్నారు.
ఓపీఎం నుంచి హెరాయిన్…
గ్రాము ఓపీఎంను మరిగిస్తే అందులో నుంచి మార్ఫిన్ పదార్థం వస్తుంది. దానికి కొన్ని మత్తుకు సంబంధించిన ముడి పదార్థాలను జోడిస్తే హెరాయిన్ తయారవుతుందని పోలీసులు తెలిపారు. ఈ హెరాయిన్ డ్రగ్ మాఫియా మార్కెట్లో కోట్లాది రూపాయల ఖరీదు చేస్తుందన్నారు. ఇక ఉత్తరాది రాష్ర్టాల్లో ఈ పంటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి.. ఆ పంటను వైద్యానికి సంబంధించిన మందులను తయారు చేసే ఫ్యాక్టరీలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పండిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిసింది. ఇక్కడ దానిపై నిషేధం ఉంది. ఇక ఎవరైనా ఇలాంటి నిషేధిత పంటలను పండిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు.