సిటీబ్యూరో, సెప్టెంబరు 14(నమస్తే తెలంగాణ) : ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించినందుకు తోటి ఉద్యోగినిపై కక్ష్య పెట్టుకుని సోషల్మీడియాలో బద్నామ్ చేసిన ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శ్రీనగర్కాలనీకి చెందిన గంజి దిలీప్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో బిజినెస్ అసోసియేట్గా పనిచేస్తున్నాడు. తోటి ఉద్యోగినికి ప్రేమిస్తున్నానని ప్రతిపాదన పెట్టగా ఆమె తిరస్కరించింది. ఇది మనస్సులో పెట్టుకున్న దిలీప్ యువతికి సంబంధించిన ఇన్స్టాగ్రాం పాసువార్డు, ఇతర వివరాలను తెలుసుకున్నాడు. యువతి ఖాతా ద్వారా అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పెట్టి వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దిలీప్కుమార్ను మంగళవారం అరెస్టు చేశారు.