ఎల్బీనగర్, సెప్టెంబర్ 1 : గ్రేటర్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్పై ఏర్పాట్లను బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. నగరంలోని వినాయక సాగర్ (హుస్సేన్సాగర్ ) తర్వాత అతిపెద్దగా వినాయక నిమజ్జనోత్సవాలు సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్ వద్ద జరుగుతాయి.
ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనోత్సవాలకు సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్ వద్ద తీసుకుంటున్న చర్యలను మహేష్ భగవత్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రోడ్ల మరమ్మతులు, బ్యారీకేడ్లు, క్రేన్ల ఏర్పాట్లతో పాటుగా ప్రతి యేటా వినాయక నిమజ్జనోత్సవాలకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఏర్పాట్లను జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి మహేష్ భగవత్కు వివరించారు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాతంగా వినాయక ఉత్సవాలు జరిగేలా తగు చర్యలు తీసుకుంటామని, అదే విధంగా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు.
కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ సీఐ సీతారాం, ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఉప కమిషనర్ సురేందర్రెడ్డి, సరూర్నగర్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, జీహెచ్ఎంసీ ఎస్ఇ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.