ఉప్పల్, మే 18: ఇతరులకు సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలని.. జీవితంలో స్థిరపడ్డ ప్రతిఒక్కరూ పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మంగళవారం ఉప్పల్లోని అభిసాయి దత్తా అనాథ ఆశ్రమంలో హర్యానా నాగ్రిక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనాన్ని సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో సేవలు అందిస్తున్న వారికి తమవంతు సాయం చేస్తామని అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 18 అనాథ ఆశ్రమాల్లోని చిన్నారులు, వృద్ధులు, నేషనల్ హైవే ప్రయాణ ట్రక్ డ్రైవర్లకు భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు.
గతేడాది లాక్డౌన్ సమయంలో రాచకొండ పోలీసుల సహకారంతో హర్యానా నాగ్రిక్ సంఘం సభ్యులు అనాథ ఆశ్రమాలకు ఉచిత మ ధ్యాహ్న భోజనం అందించారని గుర్తు చేశారు. అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకొని సేవలు అందించడం అభినందనీయమన్నారు. హ ర్యానా నాగ్రిక్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ అభిసాయి దత్తా అనాథ ఆశ్రమానికి ఐదు కంప్యూటర్లు, వాటర్ ఫిల్టర్లు అందజేస్తామన్నారు. అంతేకాక ఆశ్రమంలోని ఇద్దరు విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు తోడ్పాటు ఇస్తామన్నారు. కరోనా రోగులకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హర్యానా నాగ్రిక్ సంఘ్ అగర్వాల్, సందీప్ మిట్టల్, మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, ఎన్సీహెచ్.రంగస్వామి, రాచకొండ పోలీసులు పాల్గొన్నారు.