హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసుల కోసం ఏర్పాటు చేసిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును సీపీ మహేశ్ భగవత్ మంగళవారం ప్రారంభించారు. ఈ కోర్టును నేరెడ్మెట్లో ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబుతో పాటు మల్కాజ్గిరి డీసీపీ పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ఆడటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందని సీపీ పేర్కొన్నారు.