గోల్నాక, సెప్టెంబర్ 6 : తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాక డివిజన్ మారుతీనగర్ బస్తీ వాసులు గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలసి తమ సమస్యలు వివరించారు.
ముఖ్యంగా మంచినీటి సమస్యతో పాటు బస్తీలో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు.
వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి జీఎం సుబ్బారాయుడు, డీజీఎం సతీష్, ఏఈ రోహిత్తో పాటు మారుతీనగర్ వెల్ఫేర్ అసొసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.