మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మైలార్దేవ్పల్లిలో ఉన్న గ్రంథాలయాన్నిమార్చే ముందు విలేజ్లో మరో చోట గ్రంథాలయం,యూత్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. ఆప్కో కాలనీ సీసీ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు.
దశల వారిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హమీ ఇచ్చారు.అన్ని బస్తీలలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, సీసీ రోడ్ల పై దృష్టి సారించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూడి కమీషనర్ జగన్ ,ఈఈ నాగేందర్గౌడ్,ఏఈ బల్వంత్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్గౌడ్ ,డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్,యూత్ అధ్యక్షుడు రఘుయాదవ్ ,కాశిగారి యాదగిరి,మధుబన్ నాని,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.