రవీంద్రభారతి, జూలై 18 : సూర్యచంద్ర, ఎంవీఆర్ గ్రూప్ సంయుక్తాధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆదివారం పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పీవీఎన్ఆర్ ఎక్సలెన్సీ-2021అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు (ఢిల్లీ) సముద్రాల వేణుగోపాలాచారి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్, మంజులరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, రామ్మోహన్గౌడ్, సూర్యచంద్ర, ఎంవీఆర్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు మోహన్చంద్రగౌడ్, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.