సికింద్రాబాద్: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ రూ. 4 లక్షల విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సీతాఫల్మండికి చెందిన తిరుమలేష్, అడ్డగుట్టకు చెందిన షీలాజోసెఫ్ల కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవడంతో వైద్యం కోసం వారికి రూ. 2 లక్షల చొప్పున మంజూరైన నిధుల పత్రాలను అందజేశారు.