వనస్థలిపురం, ఆగస్టు 23 : సాహెబ్నగర్ డ్రైనేజీ దుర్ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇంటి తాళాలను ఎల్బీ నగర్ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అందజేశారు. మృతులు శివ, అంతయ్య కుటుంబాలకు ఇప్పటికే రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. కాగా, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు ఇంటి తాళాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటపై నిలబడే నైజం తమదన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. వనస్థలిపురం రైతుబజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో వారికి ఇండ్లను కేటాయించామన్నారు. ఎమ్మెల్యేకు మృతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంహెచ్వో మంజుల వాణి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.