హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ప్రగతిభవన్లో శనివారం పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణాలను సెట్రైట్ చేసుకొనేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పదిరోజుల సమయాన్ని అధికారు లు సమర్థం వినియోగించుకోవాలని, ఇది ‘మ్యాప్ యువర్ టౌన్’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న అన్నిశాఖల రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా రూపొం దించాలన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్థికి ఖర్చు చేయడానికి మంత్రులకు రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్కు కోటి రూపాయల ఫండ్ను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులను స్థానిక జిల్లా మంత్రి నుంచి అప్రూవల్ తీసుకొని ఖర్చుచేయాలని పేర్కొన్నారు. పలు ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న బకాయిలను సర్దుబాటు చేసుకోకుండా పెండింగ్లో ఎందుకు పెడుతున్నారని కేసీఆర్ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వశాఖల మధ్య ఉన్న పరస్పర బకాయిలను జూలై చివరికల్లా బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా పరిషరించాలని ఆదేశించారు. పొరపాటున కూడా శా ఖల మధ్య బిల్లులను పెండింగ్లో పెట్టకూడదన్నారు.
‘పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఇండ్లు, కార్యాలయాలు, పని ప్రదేశాల నుంచి సేకరించిన చెత్తను వేయడానికి ప్రతి పట్టణానికి డంపింగ్యార్డులు ఉండాలి. చాలా పట్టణాల్లో డంపింగ్ యార్డు లు సరిగా లేవు. డంపింగ్ యార్డు లేని పట్టణాల్లో చెత్తను రోడ్లపై వేస్తారు. అలాచేస్తే ఆయా పట్టణాలు పరిశుభ్రంగా ఎలా ఉంటాయి? భవిష్యత్తరాలు మంచి వాతావరణంలో ఉండాలంటే సేకరించిన చెత్తను ఒక దగ్గర వేయాలి. ప్రతి పట్టణంలో కనీసం నాలుగైదు డంపుయార్డుల కోసం స్థలాలను సేకరిం చి పెట్టుకోవాలి’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాస్మొపాలిటన్ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాములవుతున్నారని, భవన నిర్మాణరంగం, మిల్లింగ్లో.. బీహార్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. అలా వచ్చి పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉండటంకోసం వలస కార్మికుల పాలసీని రూపొందించాలని పేర్కొన్నారు.
నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరేట్లకు వివిధ జిల్లా స్ధాయి కార్యాలయాలను తరలించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఖాళీ అయిన ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను, ఆస్తులను జిల్లా కలెక్టర్లు వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాంటి స్థలాలను ప్రజావసరాలకోసం వినియోగించాలని ఆదేశించారు. ప్రభుత్వశాఖల భూములు, ఆస్తుల వివరాలను రికార్డుచేయడానికి, సంరక్షించి, పర్యవేక్షించడానికి జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్ను నియమించాలని సూచించారు. ఈ ఎస్టేట్ అధికారులం తా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేయాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఎస్టేట్ ఆఫీసర్ను నియమించి సీఎస్ పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా చూడాలని అధికారులకు స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలను (ఇన్వెంటరీ ) జూలై నెలాఖరు కల్లా సిద్ధంచేయాలని చెప్పారు. ప్రతి లక్ష జనాభాకు ఒక వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మించాలని ఆదేశించారు. ప్రతి మార్కెట్ను పార్కింగ్ సౌకర్యాలు ఉండేలా మూడెకరాలకు తకువ కాకుండా ఉండే స్థలంలో నిర్మించాలన్నారు.
ప్రతి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారుల పర్యటనల కోసం ప్రత్యేక చాంబర్లు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ఈ చాం బర్లను వినియోగించుకొని, సమీక్షలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో జంట హెలిపాడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పట్టణాలలో భూమిని శాస్త్రీయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు బ్రెజిల్లోని రియో డి జనీరో నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. కొం డలు, గుట్టల ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమాల ను విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. మండలానికి ఒకటి చొప్పున పదెకరాల విస్తీర్ణంలో‘ప్రకృతి వ నం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రజా అవసరాల రీత్యా అవసరమైనచోట చట్ట ప్రకారం భూసేకరణ చేపట్టాలని తెలిపారు.
‘కొత్తగా ఏర్పడే లేఔట్లు పక్కా ప్రణాళికతో ఉండాలి. విశాల రోడ్లు, పార్కులు, ఉమ్మడి ప్రయోజనాలకు స్థలాలు ఉండాలి. ప్రణాళిక ప్రకారం పట్టణాలను అభివృద్ధికే కొత్త చట్టాలను తీసుకొచ్చాం. ఆ చట్టాల్లోని నిబంధనల ప్రకారమే లేఔట్లకు అనుమతులివ్వాలి. కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఔట్లకు అనుమతులు ఇవ్వకూడదు. నూతన చట్టాల్లోని నిబంధనలను విధిగా అమలుపరచాలి. లేఔట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమి ని విధిగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయాలి. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలి.’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో మారెట్ అవసరాలకు అనుగుణంగా, రైతుకు వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటలను అధికారులు ప్రోత్సహించాలని సీఎం చెప్పారు. వెదజల్లే పద్ధతి ద్వారా వరి పండించే విధానాన్ని అవలంబించేలా రైతులను చైతన్యంచేయాలని తెలిపారు. కంది, శనగ, పత్తి, ఆయిల్పామ్ వంటి ప్ర త్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. అటవీ పునరుజ్జీవనంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. వివాదం లేని అటవీ భూముల్లో ముందు పునరుజ్జీవన చర్యలు ప్రారంభించాలన్నారు. జాతీయ రహదారుల్లో పచ్చదనాన్ని పెంచే బాధ్యత కాంట్రాక్టర్లదేనని చెప్పారు. ఫారెస్టు స్మగ్లింగ్ను అరికట్టడానికి చెక్పోస్టులను యా క్టివేట్ చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాలనుంచి గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాను కఠినంగా అరికట్టాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.