హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని భారత్ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కోరారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవీ షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ, భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారి, పంపిణీలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. కొవిడ్ నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సరైన జాగత్త్రలు పాటించడం కూడా అవసరమన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.