హైదరాబాద్ : సోమాజిగూడలోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హోటల్లోని రెండు గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆ హోటల్పై దాడి చేసి ఐదుగురు యువతులను, ఈ దందా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చేసి విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు వ్యక్తులను పోలీసు స్టేషన్కు తరలించగా, ఐదుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.