వెంగళరావునగర్, ఆగస్టు 31 : మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై ఎస్.ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. కేంద్రం నిర్వాహకురాలితో పాటు అయిదుగురు యువతులు, మరో విటుడిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేట గురుద్వారా సమీపంలోని కె.వి.ఆర్ ఎన్క్లేవ్లో గల ఏంజెల్స్ ప్యామిలీ సెలూన్ అండ్ స్పా పేరిట కొనసాగుతున్న మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్.ఆర్.నగర్ పోలీసులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి.రామ్ప్రసాద్ నేతృత్వలో సిబ్బంది దాడి చేశారు.
కేంద్రం నిర్వాహకురాలు నోవ ప్రసన్న వేపరాల (26)తో పాటు విటుడిగా వచ్చిన పెద్దయ్యగారి కృష్ణయ్య(33)ను అరెస్టు చేశారు. వీరితో పాటు అయిదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించామని, యువతులను కౌన్సిలింగ్ అనంతరం రెస్క్యూ హోంకు పంపనున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.