బల్క్ మద్యం విక్రయాలపై నిషేధం

- ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు
- నగర సరిహద్దుల్లో చెక్పోస్టులు
- మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బల్క్ మద్యం విక్రయాలు, కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ప్రచారం, పోలింగ్ సమయంలో ఓటర్లకు మద్యం పంపిణీ జరగకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరితోపాటు పొరుగు జిల్లాలకు చెందిన ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీని అరికట్టేందుకు అధిక మొత్తంలో(బల్క్గా) మద్యం విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే వ్యక్తికి ఒకటి లేదా రెండు కార్టన్ల కంటే ఎక్కువ మద్యం విక్రయిస్తే వైన్స్ నిర్వాహకులతోపాటు కొనుగోలుదారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలు లేని ప్రాంతాల నుంచి మద్యం సరఫరా చేయకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆర్టీఏ చెక్పోస్టుల వద్ద రవాణాశాఖ, ఆబ్కారీ అధికారులు ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వీరికితోడు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను రంగంలోకిదించారు. ఎవరైన అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ పరిధిలో డ్రై డే(మద్యం విక్రయాలపై నిషేధం) ఉన్నాయనీ, ఆ రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్లోకి మద్యం సరఫరా జరగకుండా పోలీసులతో కలిసి పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు ఆబ్కారీ అధికారులు స్పష్టంచేశారు. పోలింగ్ రోజైన డిసెంబరు 4న కూడా డ్రైడే అమల్లో ఉంటుందని చెప్పారు. మద్యం దుకాణాల్లో జరిగే క్రయ, విక్రయాలను పరిశీలించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్టు ఆబ్కారీ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- సైకిల్పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని
- దేశానికి బలమవుదాం.. కోహ్లి, రహానే రిపబ్లిక్ డే విషెస్
- అటవీశాఖ ఉద్యోగులకు పీసీసీఎఫ్ ప్రశంస
- చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు
- కూతుళ్ల హత్య కేసు.. తల్లీదండ్రులు అరెస్ట్
- వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆస్ట్రాజెనెకా వివరణ