హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య నేత, మీడియా టైకూన్ జిమ్మీ లాయ్కు 14 నెలల జైలు శిక్షను ఖరారు చేశారు. 2019లో హాంగ్కాంగ్లో ప్రజా ఉద్యమం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అనైతిక రీతిలో సమావేశాలు నిర్వహించిన జిమ్మీపై ఆ దేశ కోర్టు ఈ శిక్షను విధించింది. 73 ఏళ్ల జిమ్మీతో పాటు అనేక మంది ఈ కేసులో దోషులుగా తేలారు. హాంగ్కాంగ్లో యాపిల్ డైయిలీ ట్యాబ్లాయిడ్ను జిమ్మీ స్థాపించాడు. అయితే చైనాకు వ్యతిరేకంగా ఆ పత్రికలో అనేక కథనాలు రాశారు. హాంగ్కాంగ్లో ఉన్న హక్కుల నేతలపై చైనా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. 2019లో ఆగస్టు 18, 31 తేదీల్లో నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న వారిపై హాంగ్కాంగ్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. 18వ తేదీ నిరసనలో పాల్గొన్నందుకు 12 నెలలు, 31వ తేదీ నిరసనల్లో పాల్గొన్నందుకు మరో 8 నెలల శిక్షను వేశారు.