నిజామాబాద్ : జిల్లాలోని ఎస్సారెస్పీకి నాలుగురోజుల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. బుధవారం వరకు మహారాష్ట్రలోని బాబ్లీ నుంచి వరద కొనసాగగా, గురువారం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఇన్ఫ్లో కొనసాగింది. గురువారం సాయంత్రానికి 15,360 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరిందని ఏఈఈ వంశీ తెలిపారు. నాలుగు రోజులుగా రెండడుగుల నీటి మట్టం పెరిగిందని పేర్కొన్నారు. గురువారం సాయంత్రానికి నీటి మట్టం 165.40 అడుగులు (20.895 టీఎంసీలు) ఉందని తెలిపారు. గత ఏడాది ఇదే రోజున నీటిమట్టం 170.40 అడుగుల (29.722 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి