ఆసియా చాంపియన్షిప్లో సంజీత్ పంచ్ల వర్షం కురిపించి భారత్కు రెండో స్వర్ణ పతకాన్ని అందించాడు. ఐదుసార్లు ఆసియా చాంపియన్ అయిన కజక్ బాక్సర్ లెవిట్ను చిత్తుచేసి టోర్నీలో పసిడి పట్టిన ఏకైక భారత పురుష బాక్సర్గా నిలిచాడు. తుదిపోరులో తీవ్రంగా పోరాడి ఓడిన అమిత్ పంగల్, శివ థాపా రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్కు ముందు జరిగిన ఈ టోర్నీలో మొత్తంగా మనవాళ్లకు 15 పతకాలు దక్కగా.. ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ సంజీత్ అదరగొట్టాడు. బలమైన పంచ్లతో స్వర్ణ పతకాన్ని పట్టేశాడు. సోమవారం ఇక్కడ జరిగిన 91 కిలోల పురుషుల విభాగం ఫైనల్లో సంజీత్ 4-1 తేడాతో కజకిస్థాన్ బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ వాసిలీ లెవిట్ను అలవోకగా చిత్తుచేశాడు. ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మాజీ సైనికుడు సంజీత్ ఏ మాత్రం తడబడకుండా విజయం సాధించి.. టోర్నీలో భారత్కు రెండో స్వర్ణ పతకాన్ని అందించాడు. చివర్లో కజక్ బాక్సర్ ప్రతిఘటించినా.. అద్భుతంగా పుంజుకున్న సంజీత్ పవర్ఫుల్ పంచ్లు కురిపించాడు.
తృటిలో చేజారిన స్వర్ణాలు
భారత స్టార్ బాక్సర్లు అమిత్ పంగల్ (52 కేజీలు), శివ థాపా (64 కేజీలు) ఫైనల్ బౌట్లలో అద్భుతంగా పోరాడినా కాస్తలో స్వర్ణ పతకాలు చేజారాయి. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన పంగల్ (52 కేజీలు) 2-3 తేడాతో షకోబుబుదీన్ జొయిరోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే ఈ బౌట్ రెండో రౌండ్ ఫలితంపై భారత్ రివ్యూకు వెళ్లగా.. జ్యూరీ దాన్ని తిరస్కరించింది. దీంతో భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న అమిత్ – జొయిరోవ్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. రెండో రౌండ్లో పంగాల్ ఎక్కువ పంచ్లు కురిపించినా.. 28-29తో రిఫరీ మాత్రం ఉజ్బెక్ బాక్సర్కే మొగ్గుచూపాడు. దీంతో ఆ తర్వాత అమిత్ పోరాడినా ఫలితం లేకపోయింది. కాగా శివ థాపా కూడా 2-3 తేడాతోనే బాతార్సుఖ్ చుంజోరిగ్ (మంగోలియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో పంగల్, థాపా రజత పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మహిళల విభాగంలో పూజారాణి స్వర్ణం సాధించగా.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్, లాల్బువత్సాహి, అనుపమ రజత పతకాలు దక్కించుకున్నారు. మొత్తంగా ఈ టోర్నీ భారత్కు రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు దక్కాయి. సిమ్రన్జిత్ కౌర్, వికాస్ కృష్ణన్, లవ్లీనా బోర్గహెయిన్, జాస్మిన్, సాక్షి చౌదరీ, మొనిక, స్వీటి, వరీందర్ సింగ్ సెమీఫైనల్స్లోనే ఓడి కాంస్య పతకాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. 2019 ఆసియా చాంపియన్షిప్లో దక్కిన 13 పతకాలే ఇప్పటి వరకు భారత్కు అత్యుత్తమ ప్రదర్శనగా ఉండగా.. ఈసారి అది బద్దలైంది.