ఖైరతాబాద్, ఆగస్టు 10 : క్రియా ఫౌండేషన్, లైన్ 24 టీవీ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కేర్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపార్ధి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారూతిసాగర్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, కొవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, హ్యుమన్రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ చైర్పర్సన్ డాక్టర్ జి. అనూహ్య రెడ్డిలు ప్రారంభించారు.
తొలుత వైద్య శిబిరానికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా అల్లం నారాయణ వైద్య పరీక్షలు చేసుకున్నారు. అనంతరం పలువురు జర్నలిస్టులకు మధుమేహం, బీపీ, ఈసీటీ పరీక్షలు నిర్వహించి, సమస్యలున్న వారికి వైద్య సూచనలు చేశారు. కార్యక్రమంలో క్రియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సాయి కృష్ణ మల్లు, టీలైన్ 24 బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎస్. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.