సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన మానవ వనరుల నిపుణులు, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ డైరెక్టర్ ప్రీతిరెడ్డికి కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది. ఢిల్లీలోని రాడిసన్లో జరిగిన కార్యక్రమంలో కామన్వెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రీతికి డాక్టరేట్ను బహూకరించారు. కార్యక్రమంలో ఆం ధ్రప్రదేశ్ ప్రైమరి విద్యా కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ శారదారెడ్డి, కామన్వెల్త్ యూనివర్సిటీ ఏషియా వైస్ చాన్సలర్ డాక్టర్ రిపురాజన్ సిన్హా, ఫౌండర్ మెంబర్ రాకేష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.