బబ్లీ బ్యూటీ ఛార్మి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నీ తోడు కావాలి చిత్రంతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన ఛార్మి అనంతరం పలు చిత్రాలలో కథానాయికగా నటించి అలరించింది. జ్యోతి లక్ష్మీ తర్వాత ఆన్ స్క్రీన్పై కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఉండి వినోదం పంచేందుకు సిద్దమైంది. ఇప్పుడు పూరీ కనెక్ట్స్ బాధ్యతలు చూసుకుంటున్న ఛార్మి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందట.
టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో ఛార్మి కూడా సమీప బంధువుని వివాహమాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తని ఛార్మి ఇలా సడెన్గా పెళ్లికి ఓకే అనడంపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని ఛార్మి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు లైగర్ సినిమాతో బిజీగా ఉంది.