సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అన్ని జిల్లాలతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో పౌల్ట్రీ, డెయిరీలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇస్తూ బుధవారం జీవో జారీ చేసింది. కనీసం సంవత్సరానికి కేవలం రూ. 100 చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ మినహాయింపు ద్వారా వందల సంఖ్యలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు ఎంతో మేలు జరగడంతోపాటు ఈ రంగాలను మరింత ప్రోత్సహించినట్లవుతుంది.