బంజారాహిల్స్,ఆగస్టు 18 : డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరీక్ష ఆగస్టు 20వ తేదీన జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సెలవును అగస్టు 19నుంచి 20కి మార్చడంతో ఆరోజున జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.