సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): భారతీయ పోస్టల్ శాఖ ద్వారా బ్యాంకింగ్, బిల్ పేమెంట్ సేవలను విజయవంతంగా అందజేస్తున్నామని హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. రీజియన్ పరిధిలో 2021-22 వార్షిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రూ.266.79 కోట్ల చెల్లింపులు 5.01 లక్షల మందికి చేశామన్నా రు. అదే విధంగా 21547 మొబైల్ నంబర్ల అప్డేట్ను ఆధార్, చైల్డ్ ఎన్రోల్మెంట్లో చేశామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయం లో పోస్టల్ శాఖ ద్వారా ఈ సేవలను విజయవంతంగా అందించామన్నారు. పోస్టల్ శాఖలో ఉన్న మొత్తం 25 రకాల సేవల్లో 15 బ్యాంకింగ్ సేవలు, 10 బిల్ పేమెంట్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్లోని పోస్టాఫీసుల్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) ద్వారా ఈ సేవలను అందిస్తున్నాం. బ్యాంకింగ్ సేవల్లో ప్రధానంగా సేవింగ్, కరెంట్ అకౌంట్లు కొత్తగా తెరవడం, ఐపీపీబీ ఎస్బీ అకౌంట్ లింకేజీ, ఇన్స్టాంట్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇన్స్టాంట్ క్యాష్ విత్ డ్రాయల్ వంటి ఉన్నాయి. అదే విధంగా, జీవన్ ప్రమాణ్, డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్, ఆధార్ సీడింగ్, జీవిత బీమాచ భీమ్ యూపీఐ సేవ లు, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు, మొబైల్ నంబర్ అప్డేట్, బిల్ పేమెంట్, పేమెంట్స్ టు పోస్ట్ ఆఫీస్ స్కీంలో భాగంగా రికరింగ్ డిపాజిట్, లోన్ అగైనెస్ట్ రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి సేవలు ఉన్నాయని తెలిపారు.