కుత్బుల్లాపూర్/బడంగ్పేట, ఆగస్టు9: బడంగ్పేట పరిధిలోని మీర్పేట పెద్ద చెరువు పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అదేవిధంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అల్లా చెరువు సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. మీర్పేట పెద్ద చెరువును మీనీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన మ్యాప్ను అధికారులు రూపొందించారు. చెరువు సుందరీకరణకు సుమారు 12.89 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రభుతం హెచ్ఎండీఏ నుంచి రూ.7 కోట్లు కేటాయించింది. అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈనెల 11న పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అల్లా చెరువును అందంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.80 లక్షలతో పనులు సాగుతున్నాయి. ఇప్పటికే చెరువు పూడిక తీత,ప్రహరీ,గ్రీన్ జాలీల ఏర్పాటుతో పాటు గతంలో మాదిరిగా డ్రైనేజీ లైన్ను ఇందులో నుంచి కాకుండా దాన్ని దారి మళ్లించి కేవలం రేయిన్ వాటర్ వాటర్ లైన్ను చెరువుకు లింక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.