ఇంద్రవెల్లి, ఏప్రిల్4 : కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. మండలకేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం పర్యటించారు. మాస్క్ ధరించని వ్యాపారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ లేకుండా దుకాణంలో కుర్చున్న 11మంది వ్యాపారులకు రూ.6800 జరిమానా విధించినట్లు వెల్లడించారు. దుకాణాల ముందు శుభ్రతను పాటించాలన్నారు. శానిటైజర్ ఏర్పాటు చేసి కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ గంగారామ్, సిబ్బంది శంకర్లాలా, నారాయణ, ఇద్రిశ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
మాస్క్ ధరించని వారికి జరిమానా
ఉట్నూర్, మే 4 : మండల కేంద్రంలో మంగళవారం మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు జరిమానాలు విధించారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన రహదారులపై తిరుగుతూ మాస్క్లు లేనివారికి జరిమానా విధించారు. అనంతరం ఈవో సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అవసరమైతేనే బయటకు రావాలని, మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మనోహర్ ఉన్నారు.