శాయంపేట, మే 19 : మండలంలోని మాందారిపేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను బుధవారం ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి సన్మానించారు. గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో పాల్గొని వారికి మాస్కులు, గ్లౌస్లు, శానిటైజర్లను అందజేశారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కరోనా కాలంలో పంచాయతీలోని మల్టిపర్పస్ వర్కర్లు చేస్తున్న పనిని గుర్తించి వారికి మద్దతు ఇవ్వాలన్నారు. కరోనా నివారణకు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటికొండ మౌనికరవికిరణ్, ఉప సర్పంచ్ కుక్కల భిక్షపతి, కార్యదర్శి తిరుపతి, పాల్గొన్నారు.