హైదరాబాద్: బంజారాహిల్స్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అక్రమంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్స్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారివద్ద లభించిన 30 గ్రాముల ఎండీఎంఏ, 4 బోల్ట్స్ ఎల్ఎస్డీ, 50 గ్రాముల ఛరాస్, 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. నిందితులను హైదరాబాద్కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్కు చెందిన శిల్పానుగా గుర్తించారు. వారినుంచి రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను గోవాకు పంపిస్తుండగా అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.