హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పాతబస్తీ, , బహదూర్పురాలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందుతుల నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఖాజా అనే వ్యక్తి తన గృహాన్ని స్థావరంగా మార్చుకుని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి