మేడ్చల్, మార్చి 22: పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన వెంకటేశ్కు మంజూరైన రూ. 60 వేల చెక్కును మంత్రి తన నివాసంలో సోమవారం అతడికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రాములు, జగన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట కల్పవృక్షమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…కొర్రెముల గ్రామానికి చెందిన కుర్రి మహేష్కు రూ.60 వేలు, కడియాల స్వప్నకు రూ.27 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.