సైబరాబాద్ సోషల్ మీడియా మేనేజ్మెంట్.. ప్రతి చిన్న సమస్యను పరిష్కరిస్తుంది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, హాక్ ఐ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ ఫిర్యాదుదారులకు అండగా నిలుస్తుంది.. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీరించిన వెంటనే పోలీసులను స్పాట్కు వెళ్లేలా చర్యలు తీసుకుంటుంది.. దీంతో వెనువెంటనే సమస్యలు పరిష్కారమవుతున్నాయి.. ఇలా సైబరాబాద్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్రతి ఫిర్యాదును పరిష్కరించి జీరో పెండింగ్ను అమలు చేస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్పామ్లపై వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే రిసీవ్ చేసుకుని.. ఫిర్యాదు పంపిన వ్యక్తి నంబర్ తీసుకుని.. వివరాలు సేకరించి… వెంటనే స్థానిక పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించి ..సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఫిర్యాదు చాలా తీవ్రమైంది ఉంటే ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తుంది.. ఇక అక్కడి నుంచి ఆ ఫిర్యాదును అధికారులు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారు.. దీంతో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతుండటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నారంటూ ట్విట్టర్లో ఫిర్యాదు..
సైబరాబాద్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కేంద్రానికి సోమవారం ట్విట్ట ర్ ద్వారా ఒక సమాచారం అందింది. అరామ్ఘర్ నుంచి కారులో వెళ్తుండగా.. ఎదుటి కారులో ఓ పిల్లాడు విపరీతంగా ఏడుస్తున్నాడు.. అతడిని కిడ్నా ప్ చేస్తున్నారనుకుంటా అంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో బాలుడు ప్రయాణిస్తున్న కారు నంబర్ను పెట్టాడు. వెంటనే మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు ఆ సమాచారాన్ని రాజేంద్రనగర్ పోలీసులతో పా టు స్థానిక పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించా రు. రంగంలోకి దిగిన పోలీసులు 20 నిమిషాల్లో కారును పట్టుకున్నారు. అందులో ఉన్న వారిని విచారిస్తే.. ఆ పిల్లాడు తన డాడీతో వెళ్తానని మారం చేస్తున్నాడని ఆమె తల్లి వివరించింది. బాబు తండ్రిని విమానాశ్రయంలో దుబాయ్ విమా నం ఎక్కించి వస్తుండటంతో పిల్లాడు తండ్రి కావాలంటూ ఏడ్చాడని కుటుంబ సభ్యులు వివరించారు. వారు ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకుని .. పోలీసులు ట్విట్టర్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి జరిగిన ఘటన గురించి తెలిపారు.
యువకుల గందరగోళంపై వాట్సాప్కు ఫిర్యాదు..
ఎల్లమ్మబండ ప్రాంతంలోని ఓ దుకాణం వద్ద కొంతమంది యువకులు గుంపులుగా నిలబడి గందరగోళం చేస్తున్నారని సైబరాబాద్ వాట్సాప్కు ఫిర్యాదు వచ్చింది. వెంటనే సోషల్ మీడి యా మేనేజ్మెంట్ అధికారులు ఈ విషయాన్ని అక్కడ పెట్రోలింగ్ సిబ్బందికి పంపారు. వారు అక్కడి వెళ్లి గుంపులుగా నిలబడిన యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ఫిర్యాదుదారుడు పోలీసులకు ధన్యవాదాలంటూ రిైప్లె మెసేజ్ పెట్టాడు. ఈ విధంగా సైబరాబాద్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ సమర్థవంతంగా పని చేయడంతో ఇప్పుడు ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా ప్రతి ఫిర్యాదు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
వృద్ధ దంపతులకు వేధింపులు…
కూకట్పల్లి ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులను సతాయించేందుకు.. వారి భవన నిర్మాణ మేస్త్రీ.. మీరే మా సెంట్రింగ్ సామాన్లను ఎత్తుకెళ్లారు.. వాటికి తగిన డబ్బులు ఇస్తారా లేదా అంటూ వేధిస్తున్నాడు. అంతేకాకుం డా వారిపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. ఏమి చేయాలో తెలియక ఆ వృద్ధ దంపతులు సైబరాబాద్ వాట్సాప్కు మెసేజ్ పెట్టారు. వెంటనే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అధికారులు ఈ విషయాన్ని కూకట్పల్లి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి వివరాలు చెప్పారు. పోలీసులు మేస్త్రీని, వృద్ధ దంపతులను పిలిపించి అసలు విషయంపై ఆరా తీశారు. మేస్త్రీ ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు పెట్టాడని తేల్చారు.
ఫిర్యాదు అందిన ఐదు నిమిషాల్లో..
సోషల్ మీడియా మేనేజ్మెంట్.. వారి వద్దకు వచ్చిన ఫిర్యాదును ఐదు నిమిషాల్లో సంబంధిత అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తున్నారు. అదే షీ టీమ్స్కు సంబంధించిన ఫిర్యాదులను 5 నిమిషాల నుంచి 12 గంటల్లో పూర్తిగా పరిష్కరిస్తున్నారు. దీంతో బాధితులు సమస్యలు పరిష్కారం అయ్యి నిశ్చింత గా ఉంటున్నారు. షీ టీమ్స్కు సంబంధించి ఫిర్యాదులతో పాటు సైబరాబాద్ వాట్సాప్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులు కూడా పెండింగ్ లేకుండా పరిష్కరిస్తున్నారు. ఇలా పోలీసు సేవలు అందుకుంటున్న ఫిర్యాదుదారులు.. పోలీసు ఈజ్ గ్రేట్ అంటూ కితాబు ఇస్తున్నారు.