హైదరాబాద్: హైదరాబాద్లోని సైదాబాద్లో జరిగిన ఆరేండ్ల బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో అరెస్ట్ చేశారు. బాలిక హత్య అనంతరం నిందితుడు పరారైన విసయం తెలిసిందే. అయితే రాజు స్వగ్రామానికి వచ్చాడని గుర్తించిన పోలీసులు.. శుక్రవారం అర్ధరాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్ తరలించారు.
గురువారం సాయంత్రం సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలిక అదృశ్యమైంది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు కాలనీలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలి ఇంటి పక్కనే ఉండే రాజు ఇంట్లో ఆ బాలిక మృతదేహం లభించింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశాడని ఆమె కుటింబీకులు ఆరోపించారు.