దుబాయ్: నటాంజ్లోని తమ అణు కర్మాగారంపై సైబర్ దాడి ఇజ్రాయెల్ విద్రోహ చర్యేనని ఇరాన్ ఆరోపించింది. ఆ అణుకేంద్రంలో యురేనియం శుద్ధి ప్రక్రియను మరింత వేగంగా చేసే సెంట్రిఫ్యూజ్లను ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటుచేసుకుంది. దీంతో విద్యుత్తు వ్యవస్థ స్తంభించి, కర్మాగారంలో అంధకారం అలుముకుంది. సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమని ఇజ్రాయెల్ ప్రకటించలేదు.