హయత్నగర్, ఆగస్టు 22 : నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల కాలనీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎంఆర్డీసీ చైర్మర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని కట్టమైసమ్మ కాలనీ, షిర్డీనగర్, పర్వతనగర్ కాలనీల్లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాతుల చెరువు కట్ట కింద కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. ఆయా కాలనీల్లో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఊట రావడం వల్ల సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి ప్రవహించాయన్నారు. జనవరి 23న ముంపు గురైన ఈ కాలనీల్లో పర్యటించి ప్రధాన సమస్యను గుర్తించి రూ.2 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్నామని తెలిపారు.
మీర్పేట, నందిహిల్స్, వనస్థలిపురం ఏరియాల నుండి వస్తున్న వరదనీరు హయత్నగర్లోని కుమ్మరికుంట, బాతుల చెరువులోకి వచ్చి చేరుతుందని, దీంతో చెరువు దిగువన కాలనీలు ముంపునకు గురై సమస్యాత్మకంగా మారుతున్నాయని వివరించారు. దిగువన కాలనీల్లో ఊటను అరికట్టేందుకు వేసవికాలంలో చెరువు మరమ్మతులు చేపడదామంటే వీల్లేకుండా పోయిందన్నారు.
నూతనంగా వెలిసిన కాలనీల్లో జనసాంద్రతను దృష్టిలో పెట్టుకొని దశలవారీగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని హామీనిచ్చారు.
మరో రెండేళ్ల లోపు హయత్నగర్ డివిజన్లోని సౌత్ కాలనీల్లో కూడా యూజీడీ లైన్లు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని ఆయా కాలనీల్లో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ను వందశాతం వేయించుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారని, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు ముందుకొచ్చి సహకరించాలన్నారు.
కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సింగిరెడ్డి మల్లీశ్వరి, గంగని నాగేష్, ఏర్పుల ప్రసన్న, మెగావత్ గోవర్దన్, కరంటోతు శంకర్, దేవరాం ప్రకాష్, బోడ శ్రీరాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యానాల క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.