ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 28: బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) 15వ వార్షికోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేశ్ అధ్యక్షతన ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఎస్ఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎంపీలుగా ఉన్నప్పటికీ, ఏనాడూ బలహీనవర్గాల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డికి దళిత, గిరిజన సభలు పెట్టే అర్హత లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్, బీఎస్ఎఫ్ నాయకులు రహీం, ప్రవీణ్, కిషన్, రామకృష్ణ, ప్రసాద్, బాలస్వామి, నరేశ్, చరణ్, గణేశ్, మహేశ్, శేఖర్, రేవంత్, శ్రీనివాసులు, ధన్రాజ్, రాజు, దేవేందర్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.