అమీర్పేట్ : సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్కులో సోమవారం కార్తీక వన భోజనాలు జరిగాయి. పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్కులో వ్యాయామం, వాకింగ్ చేసే వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షాబాద్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం వన భోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సనత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డితో పాటు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.