సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో జంతు ప్రేమికుల డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘పెట్’ షాపులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొంది, ఆ తర్వాత స్థానిక సంస్థ నుం చి లైసెన్స్ పొందిన వారు మాత్రమే పెట్ షాపు నిర్వహించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా లైసెన్స్లు లేకుండా 70 షాపుల వరకు నిబంధనలకు తిలోదకాలిచ్చి వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ పొం దిన వారు మాత్రమే పెంపుడు జంతువుల షాపులు నడిపేందుకు, వ్యాపారం చేసేందుకు, పెంపుడు జంతువులు అమ్మకాలను రిటైల్, హోల్సేల్గా జరిపేందుకు వీలున్నదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమా ర్ వివరించారు. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిపికెట్లు పొందుటకు పెంపుడు జంతువుల షా పులను నిర్వహించే యాజమాన్యాలకు నాలుగు వారా ల సమయాన్ని ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అప్పటికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్లు పొందని పెంపుడు జంతువుల షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, సంబంధిత షాపులను మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని అర్వింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్కు ఆదేశాలు జారీచేశారు. జంతు సంరక్షణ ని బంధనలను అతిక్రమించిన డాగ్ బ్రీడర్స్పై కూడా చర్య లు తీసుకోవాలని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జంతు సంక్షేమ చట్టాలు, నిబంధనలు, సూచనల అమ లు, పెంపుడు జంతువులు ఆరోగ్యం, రక్షణ చర్యలతో పాటు జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టుటకు రూపొందించిన లక్ష్యాల ఆమలులో భాగంగా జంతు సంక్షేమ బోర్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందుటకు తప్పనిసరి చేశారు. చట్టం ప్రకారం ప్రతి పెట్ షాపు రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జీహెచ్ఎంసీ నుంచి వ్యాలీడ్ ట్రేడ్ లైసెన్స్ను కలిగి ఉండాలి.
పెంపుడు జంతువుల షాపు నిర్వహణకు ముందస్తుగా జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొం దాల్సి ఉంటుంది. ఇందుకు నిర్దేశిత ఫారం ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెంపుడు జంతువుల సంరక్షణ, అటువంటి షాపుల నిర్వహణలో ఈ చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రూపొందించిన పెంపుడు జంతువులపై క్రూరత్వ నిషేధి త చట్టం-2018 ప్రకారం రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో సంబంధిత షాపు ఏర్పాటు, అమలులో నియమ నిబంధనలు పరిశీలించాకే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అనంతరం దీనిపై జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ జారీ చేస్తుంది. అప్పుడే పెంపుడు జంతువుల షాపును నిర్వహించాల్సి ఉంటుంది.