హైదరాబాద్ : సరైన రిజిస్ట్రేషన్స్ లేకుండా పెంపుడు జంతువుల స్టోర్స్ను నిర్వహిస్తున్న దుకాణదారులను మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రికార్డుల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో మొత్తం 70 దుకాణాలు తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీరికి నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లేనియెడల దుకాణాలను సీల్ చేయనున్నట్లు చెప్పారు. గడువు ముగిసిన తర్వాత నిబంధనలను పాటించడంలో విఫలమైన దుకాణాలకు సీలు వేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ వి. లక్ష్మారెడ్డిని ఆదేశించారు.