కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్స్కు బ్రేక్ పడింది. ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఈ నెల 31వ తేదీ వరకు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్లను నిలిపి వేస్తున్నట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ఇటీవల ప్రకటించారు. తాజగా ఆయన మరో ప్రకటన చేసారు. లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ మొదలైనప్పుడు అందులో పాల్గొనే వారు తప్పనిసరిగా షూటింగ్ వేయించుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు సెల్వమణి.
ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారికే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ప్రకటించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకున్న దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు.