మన్సూరాబాద్, ఆగస్టు 24: టీకాలు వేసుకునేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి జడ్జెస్కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే జడ్జెస్కాలనీతో పాటు సహారాస్టేట్స్ కాలనీలో పర్యటించి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను, టీకా తీసుకోవల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్షినేషన్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని టీకాలు వేసుకోవాలని సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేసుకునేందుకు అర్హులవుతారని.. వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు ఆశ్రద్ద వహించవద్దని ఆయన తెలిపారు. టీకా తీసుకోవడం ద్వారనే కరోనా నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
టీకా వేసుకోవడంతో పాటు మాస్కులు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవడం మరచిపోవద్దని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఏఎంహెచ్ఓ మంజులవాణి, పున్ననాయక్, రజిత, ఎంఓ డాక్టర్ శ్వేత, హెచ్ఈఓ వెంకటాచార్య, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్యాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఆనంద్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.