సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరు నేత్రదానం చేసే విధంగా ప్రజలను ప్రేరేపించేలా చేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. సోమవారం 36వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ శర్మన్ గోడపత్రికను విడుదల చేశారు. సమాజంలో అందరిని చైతన్య పరిచి నేత్రదానం చేసేందుకు ఒప్పించాలని, ఒకరు నేత్రాలను దానం చేస్తే వారు ఇద్దరికి కంటిచూపు ఇచ్చిన వారవుతారని అన్నారు. దీనిని అందరు ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తదితరులు పాల్గొన్నారు.